ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారుల దోపిడీ నిజం కాదా
ఆధారాలు లేకుండా సిట్ నోటీసులు ఇవ్వదు.. మంత్రి అడ్లూరి
గోల్కొండ టైమ్స్, ధర్మపురి :
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ డ్రామాలు ఆడుతు న్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావులు విచారణను రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆయన మాట్లాడారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలిస్తే దేశం కోసం పోరాడిన వ్యక్తిలా యాత్రలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపు నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్పై బురదజల్లే కార్యక్ర మంగా దీన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బెదిరించి భూములు రాయించుకున్నది,డబ్బులు వసూలు చేసినది వాస్తవం కాదా అని మంత్రి ప్రశ్నించారు.ఆధారా లు లేకుండా సిట్ ఎవరినీ విచార ణకు పిలవదని స్పష్టం చేశారు. విచారణ జరిగితేనే దోషులెవరో తేలుతుందని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పాపమైతే, రెండో పెద్ద పాపం ఫోన్ ట్యాపింగ్ వ్యవహార మేనని మంత్రి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత దుర్మార్గ మైన చర్య అని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కల్వకుంట్ల రాజ్యం నెలకొల్పాలని భావించారని, ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు.పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. దేశంలోని పేదలకు ఎంతో ఉపయోగపడే జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు అంశంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా ఇబ్బంది వచ్చినప్పుడే రాష్ట్రం అశాంతిగా ఉందని బీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసి దొరికిపోయిన బీఆర్ ఎస్ నేతలు తప్పించుకోవడానికి సెంటిమెంట్ రగిలిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలని కాంగ్రెస్ పార్టీ విశ్వసి స్తుందని, ఆ దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపా రు.కాళేశ్వరం విషయంలో భవిష్య త్తులో సీబీఐ విచారణ కూడా తప్పదని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టు కుని చేసిన దోపిడిపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపిం గ్పై కవిత చేసిన ఆరోపణలపై ముందుగా వివరణ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందయ్య,మండల అధ్యక్షుడు సంఘనబట్ల.దినేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
