– విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్
గోల్కొండ టైమ్స్, చౌటుప్పల్
మద్యం సీసాలు, డబ్బులు, బహుమతులతో ప్రలోభపెట్టే వారికి కాకుండా, తమ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రంథాలయాల ఏర్పాటు వారికి ప్రజలు ఓటు వేయాలని విపంచి ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్లలో ఎన్నికల్లో అభ్యర్థులు చేసే జిమ్మిక్కులకు ఓటర్లు ప్రభావితం కావద్దని, విద్యార్థులు, యువత సరైన మార్గంలో నడపడంలో లైబ్రరీలు కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. గెలిచిన అభ్యర్థులు తమ వార్డుల్లో ఉన్న కమ్యూనిటీ హాల్ లేదా పార్కుల్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్ల ఆరోగ్యం పాడు చేసే ప్రలోభాలకు లోనూ చేయకుండా జ్ఞాన తెలంగాణ నిర్మించడంలో పాలుపంచుకోవాలన్నారు. తాము చెల్లిస్తున్న ఆస్తిపన్ను లో గ్రంథాలయ సెస్సు కూడా ఉంటుంది కాబట్టి వారి వద్దకు ఓటు అడగాడానికి అభ్యర్డులు వచ్చినప్పుడు తమ వార్డుల్లో గ్రంథాలయ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. గ్రంథాలయ ఏర్పాటు హామీనిచ్చిన వారికే ఓటు వేయాలని ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు ఎవరైనా గ్రంథాలయం ఏర్పాటు చేసే వారికి విపంచి ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు సహాయ సహకారాలు అందిస్తామని, ఆసక్తి గలవారు 9010324446 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.
