గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మరింతగా మెరుగుపరచడానికి జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.
శనివారం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పై అదనపు కమిషనర్ లు, జోనల్ కమిషనర్ లు, ఇంజనీరింగ్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్
వెబ్ ఎక్స్ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా చేపట్టాలన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పరిశుభ్రత ప్రాధాన్యతను ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్రనగరంగా గ్రేటర్ హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్నారు.
ఇప్పటి వరకూ 1458 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 547 నిర్మాణ వ్యర్థాల తరలింపు
తొలిరోజు ఫుట్ ఓవర్ బ్రిడ్జి క్లీనింగ్ తో
ప్రారంభమైన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం గడిచిన ఆరు రోజుల్లో ఫ్లై ఓవర్లు ,రోడ్డు పక్కలు, డివైడర్లు, సెంట్రల్ మీడియన్లు, కర్బ్ స్టోన్లు,చెరువులు, నాలాలు,ఫుట్పాత్లు, పార్కులు , నిర్మాణ–కూల్చివేత (C&D) వ్యర్థాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.
జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులలోనీ
మొత్తం 1204 ఏరియాలు,పాయింట్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ లు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లు, పార్క్ లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టగా, ఇప్పటి వరకు అదనంగా1458 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 547 నిర్మాణ వ్యర్థాల తరలింపు చేపట్టారు.
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం అమలును కమిషనర్ ఆర్ వి కర్ణన్ , జోనల్ కమిషనర్ లు , డిప్యూటీ కమిషనర్ లు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రభావంతంగా అమలయ్యేలా చూస్తున్నారు.
