ఇటీవల మంత్రుల వాటాల పంచాయతీలు ముగ్గురు జర్నలిస్టులు బలయ్యారని మాజీ మంత్రి కేటీర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అతని మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఒక్క అధికారి అయినా బయటకు వచ్చి చెప్పగలడా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి చెబితే ఒక జర్నలిస్టు కథనం రాసాడు, దాని మీద ప్రభుత్వం స్పందించిందా? అని చెప్పాలన్నారు. రేపు తాము అధికారంలోకి వచ్చాక, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు బలవుతారని హెచ్చరించారు. అందుకే అంటున్న ఇదొక లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
