– తెలంగాణ సచివాలయం, చార్మినార్, కెబిఆర్ పార్క్, మెహిదీపట్నం రైతు బజార్ వద్ద కేక్ కట్ కట్టింగ్
– నగర పౌరులందరికి శుభాకాంక్షలు తెలిపిన సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్,
గోల్కొండ టైమ్స్, హైదరాబాద్
నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తెలంగాణ రాష్ట్ర సచివాలయం, చార్మినార్, కెబిఆర్ పార్క్ , మెహిదీపట్నం రైతు బజార్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హైదరాబాద్ నగర ప్రజలకు, పోలీస్ శాఖలోని సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ:
గడిచిన ఏడాదిలో పోలీస్ శాఖకు సహకరించిన నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2026లో కూడా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఇలాగే ఉండాలని కోరారు. పండగలు, వేడుకల సమయంలో కూడా కుటుంబాలకు దూరంగా ఉండి, విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితమైన మరియు నేరరహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.నగరములో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాదు పోలీసులకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదములు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసులు డి.జోయల్ డెవిస్, తఫ్సీర్ ఇకుబాల్ , డిసిపిలు రక్షిత కృష్ణ మూర్తి, కె.అపూర్వరావు, కె.శిల్పావళి, కారే కిరణ్ ప్రభాకర్, లావణ్య నాయక్ జాదవ్, సిహెచ్.శ్రీనివాస్, జి,చంద్రమోహన్, సిహెచ్ .రూపేశ్ , గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ , వి.అరవింద్ బాబు పాల్గొన్నారు.

