నారా లోకేష్ జన్మదిన వేడుకలు
– దుబాయ్లో ఘనంగా నిర్వహణ
గోల్కొండ టైమ్స్, ఆంధ్రప్రదేశ్
- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని, దుబాయ్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నారా లోకేష్ నాయకత్వాన్ని, యువతకు ఆయన అందిస్తున్న ప్రేరణను కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో నూతన ఉత్సాహం నింపి, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ సేవలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ వేడుకల్లో ఎన్ఆర్ఐ టీడీపీ – యూఏఈ కార్యవర్గానికి చెందిన అధ్యక్షులు విశ్వేశ్వరరావు మోతుకూరితో పాటు నిరంజన్ కంచర్ల, వాసు పొడిపి రెడ్డి, రాజా రవి కిరణ్ కోడి, హరి కల్లూరి, ప్రసాద్ దారపనేని, ఖాదర్ బాషా షేక్, సింగయ్య రామినేని, సురేంద్ర బెజవాడ, మధుసూధన్ తల్లూరి, మోహన్ మురళి, తులసి ముక్కు, ప్రసాద్ కుడిపుడి, సాహుల్ సూర్యదేవర, సునీల్ బోయపాటి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
