– సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
– పారిశ్రామిక విధానంపై సీఎం శ్వేత పత్రం విడుదల చేయాలి
– రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
మరో వంద సంవత్సరాలకు స్పూర్తిలా సీపిఐ శతవార్షికోత్సవ ముంగిపు సభ ఈ నెల 18న భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గసభ్యులు రావుల వెంకయ్య, ఏపీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్నారు. కె. రామకృష్ణ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో కార్మికులు, రైతులు, కష్టజీవులు, మహిళలు, విద్యార్ధులు శతవార్షికోత్సవ ముగింపు సభలో పాల్గొన్నారన్నారు. ఒక రాజకీయ పార్టీ వంద సంవత్సరాల పాటు నిలబడటమే గొప్ప విషయమైతే వంద సంవత్సరాల ముగింపు సభ మరో వంద సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చే పద్ధతుల్లో జరిగిందన్నారు. ర్యాలీని జయప్రదం చేసిన కమ్యూనిస్టు శ్రేణులు, రెండు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి తరపున విప్లవాభినందనలు తెలియజేశారు. అలానే పార్టీ జాతీయ సమితి సమావేశాలు కూడా ఈ నెల 20,21 తేదీల్లో ఖమ్మంలో జరిగాయని, ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు సీపీఎం జనరల్ సెక్రటరీ ఎం.ఏ. బేబి, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపంకర భట్టాచార్య, పార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ దేవరాజన్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారన్నారు. భారతదేశంలో నేడు నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితులు ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టుల ముందు ఉన్న కర్తవ్యం అనే అంశంపై సెమినార్ జరిగిందన్నారు. ప్రధానంగా ప్రపంచ, దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చాలా సీరియస్, లోతుగా చర్చించామన్నారు. ఈ రోజు ప్రపంచంలో ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరినీ బెదిరిస్తున్నారన్నారు. గతంలోనూ సామ్రాజ్యవాదులు, వారి దుశ్చర్యలు చూశాము కానీ ఇవేళ మరింత బరితిగించి పరాకాష్టకు చేర్చే పద్ధతుల్లో ఒక దేశ అధ్యక్షుడిని, అతని భార్యను కూడా కిడ్నాప్ చేసి వాళ్లను తీసుకువచ్చి అమెరికన్ జైలులో నిర్బంధించి అక్కడి చట్టాల ప్రకారం వారిని ప్రాసిక్యూషన్ చేస్తానని చెబుతున్నాడంటే పరిస్థితులు ఏ విధంగా మారోయో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చూడలేదన్నారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయన్నారు. ఇలా అనేక దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారని అన్నారు. ప్రతి దేశాన్ని బెదిరించే పద్ధతుల్లో చివరకు నాటో కూటమిలో ఉన్న దేశాలను కూడా బెదిరించే స్థాయికి ఇవేళ ట్రంప్ దిగజారి ప్రవర్తిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఆయన ప్రపంచంలో పెత్తందారీ పోకడలు తీసుకువస్తున్నారన్నారు. ప్రపంచం మొత్తం అమెరికాకు అణిగిమనిగి ఉండాలన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అమెరికా ఏది ఆదేశిస్తే అన్ని దేశాలు పాటించాలన్న పరిస్థితికి ప్రపంచాన్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. ఇండియా సంగతి సరేసరి అన్నారు. ఒకప్పుడు అలీన దేశాలకు నాయకత్వం వహించి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబడిన భారతదేశం ఇవేళ సాగిలపడిందని, ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉందన్నారు. ట్రంప్ చర్యలను మోడీ ఖందించలేని పరిస్థితిలో ఉన్నారని ఆక్షేపించారు. ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పదేపదే చెబుతున్నా మోడీ ఖండించలేకపోతున్నారన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ లో గంటన్నర ఉపన్యాసం ఇచ్చారు తప్ప ఆ అంశంపై ఒక్క మాట ఎత్తడానికి కూడా జంకాడన్నారు. మనం ఏమి కొనుగోలు చేయాలి. ఎవరితో వ్యాపారం చేయాలి. అనేది మన ఇష్టమని, రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయకూడదని చెప్పి ట్రంప్ హుకుం జారీ చేస్తున్నారని, ఆయనకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. వీసా నిబంధనలు మార్చి అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇవేళ మాట్లాడలేని దుస్థితిలో మన భారత దేశ ప్రభుత్వం, ప్రధానిమోదీ కనపడుతున్నారన్నారు. ట్రంప్ చర్యలపై కనీసం మాట్లాడటం లేదు, ఖండించడం లేదన్నారు. ఈ అంశాల అన్నింటిపై, అలానే భారతదేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్ధిక సామాజిక పరిస్థితులపై జాతీయ కౌన్సిల్లో చర్చించి తొమ్మిది తీర్మానాలు ఆమోదించడం జరిగిందన్నారు. ఇవేళ రూపాయి విలువ పతనంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజంగా సిగ్గుపడాలన్నారు. భారతదేశ చరిత్రలో ఏనాడు రూపాయి విలువ ఇంతగా దిగజారలేదన్నారు. ఒక డాలర్ రూ.91.64 పైసలకు వచ్చిందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో ఒక డాలర్ రూ.60లు ఉన్నప్పుడు ఏ దేశంలోనూ రూపాయి విలువ పడిపోవడం లేదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారని, ఇప్పుడు రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం అయితేలేదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారని, ఇప్పుడు రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం అయితే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఆర్థిక వేత్తలు ఏమైయ్యారని ప్రశ్నించారు. మోదీ ఉ ండగానే రూపాయి విలువ ఇంకా దిగజారి డాలర్కు వంద రూపాయలు అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయని, రూపాయి విలువ పడిపోయిందన్నారు. మరోవైపు లక్షల కోట్లు అప్పులు చేస్తూ కార్పోరేట్లను పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కర్నాటక గవర్నర్ కూడా ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని మార్చాలని కోరుతున్నారన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్ క్యాబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని చదవాల్సి ఉంటుందని, కానీ అక్కడ గవర్నర్ చదవనని అంటున్నారని ఆక్షేపించారు. కేరళలో కూడా అదే పరిస్థితిj ఉందన్నారు. బీజేపీయేత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ అధినేతను కించపరుస్తున్నారన్నారు. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. వాస్తవానికి ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే క్యాబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్లు చదవాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. లేదంటే దాన్ని తొలగిస్తేనే మంచిదని సూచించారన్నారు. గవర్నర్లు అసెంబ్లీలో చదవాల్సిన అవసరం లేదని, దానికి ఒక సవరణ చేస్తే సరిపోతుందని ఆయన సూచించారన్నారు. నేడు దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తూ, ఫెడరల్ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి దేశ వ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పబ్లిక్ రంగాన్ని టోటల్గా ప్రైవేటీకరణ చేస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అతి త్వరలోనే ఎవరికో ఒకరికి వారు ఒప్పచెబుతారని అన్నారు. ఇక్కడ నారా లోకేశ్, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఆదికాదు ఇది కాదు అని మాట్లాడుకోవాల్సిందే తప్ప ఆగేపరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ల పాలసీని మార్చుకోవడం లేదన్నారు. మొత్తం ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనే ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లను ప్రైవేటు రంగంలోనూ కల్పించాలని తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక పెద్ద జాతాను ముందుకు తీసుకువస్తున్నామన్నారు. అదే విధంగా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, లౌకిక వాదాన్ని, ప్రజాతంత్ర వాదాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని, ప్రభుత్వ అనుకూల కార్పోరేట్ విధానాలను ఎండగట్టి ప్రజలను చైతన్య పర్చడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మొదటి సారిగా ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని, దీనికి అందరూ ముందుకు రావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ జనవరి 26న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా సీపీఐ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను రక్షించుకోవాలనే డిమాండ్లో ప్రతిజ్ఞకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ చేయాలన్న ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలో ఉన్న లక్ష్యాలకు ఈ రోజు తిలోదకాలు ఇచ్చి అందులో ఉన్నటువంటి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకక వాద అనే అంశాల్లో సామ్యవాద, లౌకిక పదాలను తీసివేయాలని బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందని ఆరోపించారు. ఆ రెండు పదాలను తొలగించడం ద్వారా భారతదేశం యొక్క మౌళిక సూత్రాలు భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భారత ప్రభుత్వం అలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని సీసీఐగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజు పీపీపీ, నాలుగు పీల గురించి గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీవో ఆర్గనైజేషన్లు వివిధ దేశాల్లో అధ్యయనం చేసి పీపీపీ అనేది ఎక్కడా సక్సెస్ కాలేదని ఒక వైపు నివేదికలు ఇస్తుంటే, జగన్మోహనరెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చారు కాబట్టి ఆయనపై కోపంతోనే, పొలిటికల్ ఫ్రస్టేషన్తోనో ఈ రోజు కచ్చితంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానని చంద్రబాబుప్రకటిస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, బేషజాలకు పోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కాలేజీలు అన్నీ ప్రైవేటు పరం చేస్తే అందులో చేరే వారు అంతా కోటికిపైగా డబ్బులు కట్టి అందులో జాయిన్ అయ్యే వర్గాలు, ఇది పది పదిహేను సంవత్సరాలు కొనసాగితే తిరిగి సమాజంపైనా, సామాజిక పొందికపైన ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న అంశం ముఖ్యమంత్రి మరిచిపోతున్నట్లున్నారని అన్నారు. రేపు జీవించే హక్కుకు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని మరో సారి డిమాండ్ చేశారు. లోకేశ్ ఇటీవల 99 పైసలకే భూములు ఇస్తామని మాట్లాడుతున్నారని, ఇది కరెక్టు కాదన్నారు. ఎవరి భూములు ఎవరికి దానం చేస్తున్నారని ప్రశ్నించారు. పారిశ్రామిక వర్గాలన్నింటికీ ఇష్టానుసారంగా భూములు ఇస్తామంటే ఇది ఎవరి జాగీరు కాదు అని లోకేశ్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఎన్ని లక్షల ఎకరాలు సమీకరించారు ? ఎన్ని వేల ఎకరాలు కార్పోరేట్ కంపెనీలకు అప్పగించారు ? ఆ కార్పోరేట్ కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ? ఎంత ఉ త్పత్తిని పెంచింది ? దాని ద్వారా ప్రజలకు పెరిగిన జీవన ప్రమాణాల ఆదాయం ఏమిటీ ? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
