– – ఎంజెపీ కార్యదర్శి బడుగు సైదులు
గోల్కొండ టైమ్స్, తెలంగాణ బ్యూరో
బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఉపాధి నైపుణ్యాలు మెరుగుపరిచేలా అవగాహన కల్పించేందుకు వీలుగా నిర్మాణ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయం అని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి బడుగు సైదులు అన్నారు. బీసీ గురుకుల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే లక్ష్యంతో నిర్మాణ్ ఎన్జీవోతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ ఈ సంస్థ అందించే సహకారంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ఉపాధి నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమగ్రాభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 2005లో బిట్స్ పిలానీలో చదివిన వాళ్ళు స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ నిర్మాణ్ ఆర్గనైజేషన్. గత రెండు దశాబ్దాలుగా ఈ సంస్థ జాతీయ స్థాయిలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్యం, మానసిక వికాసం, సామాజిక నాయకత్వం వంటి రంగాల్లో పనిచేస్తుంది. దేశంలోని 26 రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిందని నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సీఈఓ మయూర్ పట్నాల అన్నారు. బీసీ గురుకుల విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉన్నారు. ఒప్పందంపై సంతకం చేసే కార్యక్రమంలో డాక్టర్ సుచిత్ర, శాంత కుమార్ చిలుముల, ఉషాకర్ కీర్తి పాల్గొన్నారు.
