పదో తరగతి మార్కుల ఆధారంగా, ఎలాంటి పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి సుమారు 28,740 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామకాల్లో ముఖ్యంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పదో తరగతి ఉత్తీర్ణులకు ఇది మంచి అవకాశం. ఈ నియామకాలకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ జనవరి చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులను ఈ విధానంలో భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
మొత్తం ఖాళీలు (అంచనా)
మొత్తం పోస్టులు: 28,740
తెలంగాణ: 519 పోస్టులు
ఆంధ్రప్రదేశ్: 1,215 పోస్టులు
నోటిఫికేషన్ & దరఖాస్తు ప్రారంభం: జనవరి 31, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2026
మెరిట్ లిస్ట్ విడుదల: ఫిబ్రవరి 28, 2026
వేతనాలు:
BPM: నెలకు రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు
ABPM / GDS: నెలకు రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ. 100
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలకు: ఫీజు లేదు
