రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే అడ్డుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. తన విన్నపం మేరకు, తనపై గౌరవంతో సీఎం నారా చంద్రబాబునాయుడు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని ఏపీ సర్కార్ తెలిపింది.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ను నాటి ప్రభుత్వం చేపట్టిందని ప్రస్తావించింది. రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా జగన్ హయాంలో పనులు చేపట్టారని గుర్తుచేసింది. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్కు సంబంధించి కోర్టులో కేసులు వేసింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీతో సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనుల నిలిపివేసిందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
