ఆంగ్ల నూతన సంవత్సర ను పురస్కరించుకుని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లకు కార్పొరేటర్ లు, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ లు , జోనల్ కమిషనర్ లు , విభాగాల అధిపతులు, ఉద్యోగులు , సిబ్బంది జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయ లక్ష్మి మాట్లాడుతూ…. కొత్త సంవత్సరంలో స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ సమగ్రాభివృద్ధికి పునరుత్తేజంతో అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని కోరారు.

