హైదరాబాద్:
ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన ‘నా అన్వేషణ’ చానల్పై హిందూ సంఘాలు మరియు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ గురువులు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలతో, ఆ చానల్పై సామూహికంగా సోషల్ మీడియా బ్లాక్ & రిపోర్ట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా “No Apology, No Respect — Ban Naa Anveshana” అనే నినాదంతో దేశవ్యాప్తంగా హిందువులు శాంతియుతంగా స్పందించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమ అజెండా:
- అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ‘నా అన్వేషణ’ చానల్ను
➤ Unfollow
➤ Unsubscribe
➤ Report చేయడం - హిందూ విశ్వాసాలు, గురువులపై ద్వేషపూరిత కంటెంట్కు వ్యతిరేకంగా శాంతియుత డిజిటల్ నిరసన
హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ,
“వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో హిందూ ధర్మం, గురువులను కించపరచడం సమాజంలో విభేదాలకు దారి తీస్తుంది. ఇది భావప్రకటన స్వేచ్ఛ కాదు, మతపరమైన అవమానం” అని అన్నారు.
వారు ఇంకా మాట్లాడుతూ,
“ఈ ఉద్యమం ద్వేషానికి కాదు, గౌరవానికి. చట్టబద్ధంగా, శాంతియుతంగా హిందువులు ఏకం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం” అని స్పష్టం చేశారు.
ఐక్యతకు పిలుపు
ఈ సందర్భంగా “ధర్మో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు.
హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువి బాధ్యత అని, ఐక్యతే శక్తి అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ డిజిటల్ ఉద్యమం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుండగా, డిసెంబర్ 31న జరగనున్న ఈ కార్యక్రమంపై అందరి దృష్టి నెలకొంది.
