బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఇటీవల కాస్త స్థిరంగానే ట్రేడ్ అవగా.. ఇప్పుడు ఒక్కరోజులోనే పరిస్థితి తారు మారు అయింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి.
భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలే.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాలను ధరించాలని చూస్తుంటారు. ఈ అభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని చెప్పొచ్చు. ఇంకా ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే ఎక్కువగా మహిళలు ధరించి ముఖ్యమైన సందర్భాలలో గోల్డ్ జ్యువెలరీ ధరించేందుకు ఇష్ట పడుతుంటారు.
ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించే ముందు కూడా.. అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం చేసి పంపిస్తుంటారు. ఇది భారతదేశంలో సంప్రదాయంగా వస్తుంది. బంగారానికి ఇటీవల సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా బంగారంపై చాలా మంది విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వెళ్లింది.
