- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై చర్యలు
- సాయిబాబా దేవుడు కాడంటూ పోస్టులు
- కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు. మాధవీలతతో పాటు, ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల కారణంగా ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
