సినీ నటుడు మంచు మనోజ్, అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి సమాజ సేవలో సరికొత్త అడుగు వేశారు. సమాజానికి తమ వంతు సాయం అందించేందుకు “ఐక్య ధైర్య సేన సమితి” పేరిట ఒక కొత్త ఛారిటబుల్ ట్రస్ట్ను వారు ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేయాలనే లక్ష్యంతో, తొలి అడుగుగా ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు మంచు మనోజ్ ప్రకటించారు. ఆ ఐదుగురు పిల్లల పూర్తి బాధ్యతలను తామే చూసుకుని, వారిని ఉన్నత చదువులు చదివిస్తామని మనోజ్ దంపతులు తెలిపారు.
