టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 11:13 గంటల శుభ ముహూర్తానికి శ్రీవారి సన్నిధిలో కావ్యా రెడ్డి మెడలో సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేశారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిన్నప్పటి నుంచి తిరుమల అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడే పెళ్లి జరగడం తన అదృష్టమని సాయి శ్రీనివాస్ ఎమోషనల్ అయ్యారు. కాగా, సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
