తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పోలింగ్ నేడు (ఏప్రిల్ 23) రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. మక్కల్ నీధి మైయం అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట్ కార్పొరేషన్ పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఎన్నికల బరిలో లేనప్పటికీ, డీఎంకే కూటమికి మద్దతు తెలుపుతూ కమల్ హాసన్ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
