తనను యాంటీ హిందూగా చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారని నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసేవారే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ధర్మాలను సమానంగా గౌరవిస్తానని, శ్రీరాముడిని అవతార పురుషుడిగా భావిస్తానని చెబుతూ.. రాముడి గురించి తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
