ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రామాయణ’ టీజర్ తాజాగా రిలీజైంది. నితిష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తున్నాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తుంది. అసలు ఒక్కో షాట్ మైండ్ బ్లోయింగ్. విజువల్స్ మాత్రం చాలా రిచ్గా కనిపిస్తున్నాయి. అయితే.. సాయి పల్లవి, యష్లను టీజర్లో చూపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. మూడు పార్ట్లుగా తెరకెక్కుతున్న సినిమా దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది.
