గంజాయి సరఫరా కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని మోత్కూర్ పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సరఫరా కేసులో నిందితుడు భువనగిరికి చెందిన మహేష్ను కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. అయితే మహేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు మోత్కూరు ఇన్స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీన మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని యువకుడు సందీప్కు గంజాయి సరఫరా చేసేందుకు మహేష్ వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. గంజాయి చేతులు మారుతుండగా, పోలీసులు దాడి చేసినప్పటికీ మహేష్ తప్పించుకున్నారు. సందీప్ పోలీసులకు దొరికాడు. మహేష్పై ఇదివరకే భువనగిరిలో పలు కేసులు నమోదైనట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పరారీలో ఉన్న మహేష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, అతను భువనగిరి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి ఈ నెల 20న అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో గంజాయి సరఫరాపై దర్యాప్తు చేస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా లేదా సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
