పుస్తక పఠనం అనేది మనందరినీ ఒకే దగ్గర కలిపి, ఆలోచనతో మన ఇంటికి పంపింది.మన హైదరాబాద్ 38వ బుక్ ఫెయిర్ 2025 డిసెంబర్ 19 నుండి 29వరకు అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సోషల్ మీడియా పేరున సెల్ ఫోన్ లో కిక్కిరిసిపోయే యువత,పిల్లలు,పెద్దలు,వృద్ధులు,అలరించే రచయితలు,కవులు,గాయకులతో పుస్తక పండుగ ముగిసింది.పుస్తక పఠనం అలా మనందరినీ కలిపింది.లోకకవి అందెశ్రీ ప్రాంగణం అని నామకరణం చేసి 50 పుస్తకాలు ఆవిష్కరణకు ఈ బుక్ ఫెయిర్ వేదికై నిలిచింది.
*ఆవిష్కరణ పండుగ*
మన పండుగలన్నీ మత ఆచారాలకు మూఢనమ్మకాలు ఆచారాలు వాటి కోసమే.అలాగే రాజకీయాలు నిలయమైపోతున్న వేళ ఆవిష్కరణలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకునే పండుగ కొత్త పండుగకి తెరలపింది.వివక్ష లేని,మతం లేని లౌకిక పండుగ ఇదే మన పుస్తకాల పండుగ.పుస్తక పఠనం అలవాటైతే మనిషికి, మనసుకి ప్రశాంతతను ఇప్పుడు కాకుండా గొప్ప మేధావిగా కూడా తీర్చిదిద్దుతుంది.పుస్తక ప్రదర్శన విభిన్న అభిప్రాయాలకు భావజాలకు వేదికగా నిలిచింది.
*యువ రైటర్స్ కి ప్రేరణ బుక్ ఫెయిర్*
ఈ బుక్ ఫెయిర్ కోసం ప్రత్యేకంగా ప్రచురణలు, ఆవిష్కరణలు కొన్ని సంవత్సరాలుగా ఒక వీక్షకుడిగా వచ్చిన వ్యక్తి ఈరోజు రైటర్ గా పరిచయం అయ్యాడు.ఈ మధ్యకాలంలో అయోధ్య చేరిన కృష్ణ,చీకటి అంచున చిగురు,ఏఐ టెక్నాలజీ మీద ఇనుములో హృదయం మొలిచిన మోహన్ తలారి రాసిన నా పేరు భగత్ సింగ్,రైలు బండి అనే బుక్స్ కూడా మన తెలుగు రైటర్స్ తీసుకురావడం చూసాం వారితో ప్రత్యేకంగా కూడా చాలామంది మాట్లాడినారు.100 పేజీలకు తగ్గకుండా పుస్తకాన్ని తీసుకువచ్చిన వారు ప్రతి ఒక్కరు వీరి కోసం ప్రత్యేకమైన స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసినారు. ఈసారి యువతను ప్రత్యేకంగా ఈ బుక్ ఫెయిర్
ప్రోత్సహించినది.
*సోషల్ మీడియాలో బుక్ కి ఆదరణ తగ్గలేదు*
యువత అక్షరాల పండుగకు ఇస్తున్న గౌరవం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప బాట వేస్తున్నారు. అనేకమంది సోషల్ మీడియా ద్వారా ఈ ఆదివారం మనం కలుద్దాం ఈ సాయంత్రం నేను బుక్ లో ఉంటాను వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన వాట్సాప్ గ్రూపులో కాలేజీ గ్రూపుల్లో చర్చలు పెట్టి కుటుంబ సమేతంగా వచ్చినారు.సోషల్ మీడియా పోస్ట్లు చేస్తూ ఈసారి మేము ఈ బుక్ ఫెయిర్ లో అందెశ్రీ ప్రాంగణంలో అంటూ పోస్ట్ చేయడంతో కొంతమందికి ఉత్సాహాన్ని కూడా ఇచ్చినది.యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తమ వీక్షకులకు సంబంధించిన పుస్తకాలు కూడా వారు వివరించి చెప్పినారు.తమ ఛానల్ ద్వారా అంటే ఏఐ టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత కూడా అచ్చు యంత్రానికి ప్రాణం పోసింది.
*మహిళా రైటర్స్ ను ప్రోత్సహించిన బుక్ ఫెయిర్*
కొన్ని బుక్ ఫెయిర్స్ ని మనం గమనిస్తే మహిళా రైటర్స్ కూడా పెరుగుతున్నారు.ఈ బుక్ ఫెయిర్ లో 12 మంది యువరైటర్స్ ఉంటే దానిలో ఆరుగురు మహిళ రైటర్స్ ఉండడం గొప్ప విషయం.ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించారు. అలాగే నేటి కాలంలో షాపింగ్ మాల్ చుట్టూ బంగారం బండ్ల చుట్టూ తిరుగుతున్న మహిళలు అని అంటారు ఈ సందర్భంలో మహిళలకు ప్రత్యేకమైన స్థాయిని సంపాదించినారు.పుస్తకం అమ్మ నేల పకృతి నిరంతరం ఒక కొత్త విషయం నేర్పుతుంది.మహిళా చేతనం చేయడం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలని యువతని విజ్ఞానం వైపు మలచడం కోసం ఈ యువ రైటర్స్ ప్రోత్సహం కూడా ఉపయోగపడుతుంది.
*ఒక మిలియన్ మార్చ్ లాగా ఈ బుక్ ఫెయిర్*
పుస్తక ప్రదర్శననే కాదు సామాజిక చైతన్య కేంద్రం ఈసారి ప్రత్యేకమైన పబ్లిషర్స్ ఎక్కువ మంది స్టాల్స్ పెట్టుకోవడం యువకులు అధికంగా రావడం చరిత్రలో ఏనాడు లేనంత ఈ బుక్ పండుగ కోసం కౌంటర్ వద్ద అర కిలోమీటర్ దూరం వరకు బారులు తీరినారు ఒక రోజు 1,50,000 మంది వచ్చినారు విశాలంగా ప్రతి చోట లోపల కూడలి గురించే ముచ్చట్లు, సాహిత్యకారులు సంభాషణ కోసం రెండు వేదికలు ఏర్పాటు షెడ్యూల్ ప్రకారం బాలోత్సవం సాంస్కృతి కార్యక్రమాలు సందేశాలు చర్చలు పుస్తక ఆవిష్కరణలు సుమారు 280 పైగా కౌలు కళాకారులు వేదికపై మాట్లాడారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి పోలీస్ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వైపుల, ఈ బుక్ ఫెయిర్ కి ప్రముఖులు డిజిపి శివధర్ రెడ్డి, హైడ్రా కమిషన్ రంగనాథ్ సినీ ప్రముఖులు ఇలా చాలా మంది రాజకీయ నాయకులు కూడా వచ్చినారు, పుస్తకాలే కాకుండా రుచులు వంటలు వివిధ రకాల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు చరిత్రలో మరిచిపోని రోజులు పుస్తకం కోసం లైన్ నిలబడి చరిత్ర ఇది
*పల్లెకు పుస్తకం పంపిణీ చేసిన పుస్తకాల పండుగ*
చరిత్రలో నిలిచిపోయాయి పల్లెల్లో అక్షరాన్ని బతికిద్దాం అచ్చు వేసిన పుస్తకాలను మరొక్కసారి జ్ఞాపకం చేద్దామంటూ బుక్ డొనేట్ బాక్స్ పెట్టి వేలాది పుస్తకాలు సేకరించింది ఈసారి అనుకున్న దానికన్నా ఎక్కువ పుస్తకాలు రావడంతో ప్రత్యేకమైన రూమ్ను ఏర్పాటు చేశారు ఇది కదా పల్లెలకు పట్టణానికి ఉన్న స్నేహాన్ని నేర్పుతుంది
*పబ్లిషర్స్ కు జీవం పోసింది బుక్ ఫెయిర్*
ఈసారి విశాలమైన స్టాల్స్ తో ప్రత్యేకంగా కూర్చోవడానికి ఎక్కువ స్థలానికి కేటాయిస్తూ డ్రా పద్ధతి ద్వారా చిన్న బుక్స్టాల్ పెద్ద బుక్ స్టాల్ తేడా లేకుండా అందరికీ సమన్వయం చేస్తూ బుక్ నిర్వహణ కమిటీ చాలా శ్రమించింది అందరికీ అన్ని వసతుల్ని కల్పించారు, బుక్ హౌస్ వాళ్ళు సంవత్సరం పొడవుతున్న అన్ని పుస్తకాలు ఈ 11 రోజులపాటు అమ్మినారు అన్ని పబ్లిషర్స్ ని ఆదరించినారు పాఠకులు
*అక్షరానికి ఆదరించిన ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్*
ఈ బుక్ ఫెయిర్ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ చదువుకునే విద్యార్థులకు అలాగే పట్టణాల్లో చదువుకుని విద్యార్థులని కదిలించేందుకు వినూత్నంగా పుస్తకంతో నడక ప్రతి సంవత్సరం నిర్వహించడంతో ప్రజల్లో ఆలోచించే శక్తిని పెంచి పుస్తకం వైపు మార్చడం కోసం ప్రయత్నం చేసినారు అదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రావడానికి కొత్తగూడెం నుంచి ఇంద్ర పార్క్ రావడానికి ఈసారి సమయాన్ని కూడా మార్చినారు పుస్తకం పల్లెని చుట్టాలి పట్టణంలో యువతను మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ ఫెయిర్ ఇప్పటికే విజయవాడ బుక్ ఫెయిర్ కూడా 2026 జనవరి 2 నుండి జనవరి 12 వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు, అలాగే నేషనల్ లెవెల్ బుక్ ఫెయిర్ ( న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ) ఇది అంతర్జాతీయ స్థాయి బుక్ ఫెయిర్ ఇది
నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 2026 జనవరి 10 నుంచి జనవరి 18 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ నడుస్తుంది సాహిత్యానికి చరిత్రకి టెక్నాలజీకి నవలలకు పుస్తకం భారం కాకుండా బాధ్యత చూపింది ఈ బుక్ ఫెయిర్ సమూహం విజ్ఞానవంతులు తీర్చిదిద్దడం కోసమే ఈ ఫెయిర్ ఉద్దేశం.

