రాఘవభారతీ గ్రంథాలయ అధ్యక్షుడిగా బంటు తిరుమలేశ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని రాఘవాపురంలోని రాఘవాభారతి గ్రంథాలయం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బంటు తిరుమలేష్ మాట్లాడుతూ..ఈ సందర్భంగా గ్రంథాలయ అధ్యక్షుడు బంటు తిరుమలేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా గ్రంథాలయాన్ని విజయవంతంగా నడిపిస్తున్నామని , అందుకు సహకారాన్ని అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కాలంలో గ్రంథాలయాల ఆవశ్యకత పెరిగిందని, ముఖ్యంగా యువత గంజాయి వంటి చెడు అలవాట్లకు లోనవుతున్నారని తెలిపారు. విద్యార్థులు, యువతకు పుస్తకాలను చేరువ చేసేందుకు కృషి చేస్తామని, గ్రంథాలయానికి హార్థిక, ఆర్థిక సహకారాన్ని అందించాలని దాతలను కోరారు.
రాఘవభారతి గ్రంథాలయ కమిటీ:
అధ్యక్షుడు : బంటు తిరుమలేష్
ప్రధాన కార్యదర్శి : కొంపల్లి వెంకటేష్
ఉపాధ్యక్షులు: కలకోటి గోపయ్య చారి , మొహమ్మద్ నయీమ్
సహాయ కార్యదర్శి : మూషం ‘రాఘవభారతీ’ అధ్యక్షుడిగా బంటు తిరుమలేశ్, కూరెళ్ల సురేష్
కోశాధికారిగా : వంగాల శ్రవణ్ కుమార్
కమిటీ సభ్యులు: వంగాల రమేష్, కాటం మహేష్, కాటం నరేష్, దొండ వెంకట్ రెడ్డి, సూదగాని ప్రశాంత్, కూరెళ్ల శివ ప్రసాద్, మూశం భానుకుమార్, బొక్క దయాకర్ రెడ్డి, మూషం చంద్రమౌళి.


