తమ గ్రామానికి సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని ఆత్మకూరు ( ఎం) మండలం రాఘవాపురం సర్పంచ్ యరుకల యతీశ్వర్ కోరారు. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు గ్రామస్థులతో కలిసి వినతి పత్రం అందించారు. పల్లెర్ల – రాఘవాపురం – దుప్పల్లి స్టేజీ వరకు బీటీ రోడ్డు కావలన్నది తమ గ్రామస్తులు చిరకాల కోరిక అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సరైన రోడ్లు లేక విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారిస్తానని హామీనిచ్చారు.
