మహిళలు ఆర్థికంగా ఎదగాలని ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మావతి తెలిపారు. శనివారం ఆమె చేతుల మీదుగా డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు ప్రతి గ్రూప్ కు 160 కోడిపిల్లల చొప్పున పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా మహిళల స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. డాక్ర సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆమె పేర్కొన్నారు.
