గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారిని జీహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ శ్రీ రత్నాకర్, జోనల్ కమిషనర్ శ్రీ రవి కిరణ్, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శ్రీ వేణుగోపాల్, శ్రీమతి పంకజ, డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఉమ ప్రకాశ్, శ్రీమతి భాస్కర్ రెడ్డి, శ్రీమతి మంగతాయారు, శ్రీ శంకర్ సింగ్, తదితరులు జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని డిప్యూటీ మేయర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, ప్రజా సేవల మెరుగుదలపై పరస్పరంగా అభిప్రాయాలు పంచుకున్నారు. రానున్న రోజుల్లో సమన్వయంతో పనిచేస్తూ గ్రేటర్ హైదరాబాద్ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
