2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత తీవ్రంగా కుంగిపోయానని, క్రికెట్ వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చిందని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. రెండు సంవత్సరాలుగా ఈ వరల్డ్ కప్ కోసమే శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, మళ్లీ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టిందని ఆయన తెలిపాడు. మాస్టర్స్ యూనియన్ అనే ఈవెంట్లో మాట్లాడుతూ రోహిత్ చాలా ఎమోషనల్ అయ్యాడు.