తెలుగు వాళ్లకు మలయాళం సినిమాలను పరిచయం చేసింది దృశ్యం సినిమానే. తెలుగులో వెంకీమామ తీసి హిట్టు కొట్టినా.. ఒరిజినల్ ఫ్లేవరే చాలా మందికి నచ్చింది. ఆ తర్వాత దృశ్యం-2ను కూడా అదే స్థాయిలో ఆదరించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు.
