టాలీవుడ్లో నిర్మాతలు మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరింది. థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు విపరీతంగా పెంచడం వల్లే ప్రేక్షకులు రావడం లేదని నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏషియన్ సునీల్ నారంగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. నష్టాలు వస్తుంటే వ్యాపారం వదిలేసి వెళ్లాలని, అంత త్యాగం చేయనవసరం లేదని ఘాటుగా స్పందించారు. మరోవైపు, మైత్రి రవి కూడా శిరీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సంక్రాంతి సమయంలో సినిమాలు ఉన్నప్పుడు లేని కష్టాలు, ఇప్పుడు సినిమాలు లేనప్పుడే గుర్తొస్తున్నాయా అని ప్రశ్నించారు.
