రాజస్థాన్ ఉదయ్పూర్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్.బి. చౌదరి పార్థివ దేహానికి సినీ ప్రముఖులు కన్నీటి నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన నివాసానికి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, విజయకాంత్, హీరోలు ధనుష్, సూర్య, విక్రమ్ సహా పలువురు అగ్ర నటులు చేరుకొని అంజలి ఘటించారు. తన తండ్రి భౌతిక కాయాన్ని చూసి హీరో జీవా, ఆయన సోదరుడు జితన్ రమేష్ కన్నీమున్నీరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో వందలాది మందికి జీవితాన్ని ఇచ్చిన గొప్ప నిర్మాతను కోల్పోవడం సినీ రంగానికి తీరని లోటని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
