లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దాదాపు 13 ఏళ్ళ తర్వాత దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘సింగ్-గీతం’. ఈ మ్యూజికల్ ఫాంటసీ సినిమాను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాతో పాటు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. సినిమా కథ మొత్తం కుబేరపురం అనే ఊరు చుట్టు తిరుగుతున్నట్లు టీజర్తో క్లారిటీ ఇచ్చారు. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫాంటసీ, కామెడీ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
