తిరుమలలో ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ వేడుక సందడి నెలకొంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకోగా, రేణిగుంట విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానుల సందడి, కుటుంబ సభ్యుల ఆనందం మధ్య ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుమలలో జరగనున్న ఈ వివాహం కోసం అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా సిద్ధం చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి 11:13 గంటలకు సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం జరగనుండగా, ఈ వేడుకను అత్యంత నిరాడంబరంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
