బాలీవుడ్ నటి పూనమ్ పాండే ముంబై రోడ్లపై సందడి చేశారు. గురువారం (ఏప్రిల్ 23) సాయంత్రం ఆమె అంధేరీలోని ఫ్రూట్ మార్కెట్లో మామిడి పండ్లు కొంటూ కెమెరాలకు చిక్కారు. ఎంతో ఉత్సాహంగా కనిపించిన పూనమ్, వ్యాపారులతో బేరమాడుతూ మంచి పండ్లను ఏరి కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో సరదాగా మాట్లాడుతూ.. తాను “మేడమ్ లేనా” అని, అందరి కోసం మామిడి పండ్లు తెచ్చానని చమత్కరించారు. తన డ్రెస్ గురించి, తన ఇష్టాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ బోల్డ్ లుక్స్తో వార్తల్లో ఉండే పూనమ్, ఇలా సాధారణ మహిళలా మార్కెట్లో కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
