తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పోలింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు మాథ్యూ వర్గీస్ చెన్నైలోని నందనం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం తన సిరా గుర్తును చూపిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
