తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 పోలింగ్ నేడు (ఏప్రిల్ 23) రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తన సిరా గుర్తును చూపిస్తూ పౌరులను ఓటు వేయాల్సిందిగా కోరారు.
