ప్రపంచ ప్రసిద్ధ ‘టైమ్’ మ్యాగజైన్ ఏప్రిల్ 15వ తేదీన అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. మాములుగా ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, అల్లు అర్జున్ స్టార్లకు ఈ సారి చోటు దక్కుంతుందని అనుకుంటే.. ఊహించని విధంగా వేరే వాళ్లు ఈ లిస్ట్లో ఉన్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్, సుందర్ పిచాయ్ వంటి అగ్రనేతలతో కలిసి వీళ్లు చోటు సంపాదించడం గొప్ప విషయమే.
