లెజెండరీ గాయని ఆశా భోంస్లే మరణ వార్త విని ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆమె బోరున విలపించారు. ఆశా జీ మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో కలచివేసిందని, ఆమె తనకు ఒక అక్కలా, గురువులా దిశా నిర్దేశం చేశారని గుర్తు చేసుకున్నారు. “సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ఆశా భోంస్లే గొంతు లేని భారతీయ సినిమాను ఊహించుకోవడం కష్టం” అంటూ ఉషా ఉతుప్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తామిద్దరం కలిసి పాల్గొన్న కచేరీలు, రికార్డింగ్ సెషన్లను గుర్తు చేసుకుంటూ.. ఆమె మరణం సంగీత జగత్తుకు తీరని లోటని కన్నీటి పర్యంతమయ్యారు.
