సంగీత స్వరం నేలవాలింది. ఎన్నో ఏళ్లుగా భారతీయ సంగీత ప్రియులను తన పాటలతో మైమరిపించిన గొంతు మూగబోయింది. దాదాపు 12 వేల పాటలతో ఏడు దశాబ్దాలకు పైగా తన గళంతో కోట్లాది మందిని పరవశించిపోయేలా చేసిన ఆశా భోస్లే మరణ వార్త యావత్ సంగీత ప్రియులను దు:ఖ సాగరంలోకి నెట్టేసింది.
