త్రినాథ రావు నక్కిన నిర్మిస్తూ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అనకాపల్లి. విక్రమ్ సహదేవ్, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అనకాలపల్లి.. ఇక్కడ కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి భయం ఉండాలి. భయం లేనోడికి పిడికిలి రుచి.. అది లేనోడికి ఓటు రుచి చూపించాలి.. అప్పటికి లొంగకపోతే బుర్ర బద్దలయ్యేలా వాడికి తూటాల వర్షం కురిపించాలి’ అంటూ ఇంటెన్సీవ్గా టీజర్ను కట్ చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే కూడా త్రినాథరావు నక్కిన అందించాడు.
