సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హల్చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించిందని సమాచారం. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన సమయంలో కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని లావణ్యను అదుపులోకి తీసుకున్నారు.
