– సినీ నిర్మాత పొన్నం రవిచంద్ర
గోల్కొండ టైమ్స్, హైదరాబాద్
సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ‘పూలే ‘ భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రకు మైలురాయి వంటిదని నిర్మాత, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. గురువారం హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూలే దంపతులు మహిళలందరికీ విద్య నేర్పిన ఆది గురువులని అన్నారు.
200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి, జ్యోతిబాపూలే దంపతులు దళితులు స్త్రీలు బహుజనుల పట్ల అప్పటి సమాజ అమానవీయతకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ఆ సామాజిక ఉద్యమాన్ని తెలుగు నేలపై స్ఫూర్తి నింపడం కోసం హిందీ లో వచ్చిన ఈ సినిమాను తెలుగు లో చేశామని తెలిపారు. సినిమా మాటల రచయిత కత్తి చేతన్ మాట్లాడుతూ ఇది వ్యాపారత్మక సినిమా కాదని, సామాజిక సంఘర్షణల కళాత్మక చిత్రమని దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులంతా చారిత్రక దృష్టితో చూడాలని అన్నారు. ఈ సినిమా తెలుగులో ఒక సంచలమైన సందర్భం అవుతుందని అన్నారు.
పూలే సినిమాను ప్రివ్యూ షో చూసి సినిమా టీమ్ ని అభినందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు, దిల్ రాజు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పొన్నం రవిచంద్ర, కత్తి చేతన్ సివి నవీన్ కుమార్, రాజీవ్ చంద్ర పొన్నంలు తెలిపారు. ఈ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందని మహిళా అభ్యున్నతికి ఆనాడు ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా సర్వ సమానత్వ భావన కోసం జరిపిన త్యాగాలను ఈ తరానికి గుర్తు చేస్తుందని వారు అన్నారు. తెలుగు సమాజంలో బహుజన రాజకీయ అధికారానికి బాటలు వేస్తుందన్నారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ పరిశీలన తర్వాత జనవరి చివరి వారంలో అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తామన్నారు. మనం ఇప్పుడు ఈ ఆధునిక ప్రజాస్వామిక సమాజంలో ఉన్నామంటే పూలే అంబేద్కర్ లాంటి దార్షానిక విప్లవకారులే కారణమన్నారు. ఈ సమావేశంలో తిరుపతి గౌని, ఉదయ్ కుంభం, జనని, నేతికార్ సురేష్ లాల్, అభినవ్ వరాల, నీలం రమేష్, బత్తిని వినయ్ గౌడ్, బత్తుల గణేష్ పాల్గొన్నారు.
